అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అయ్యి తల్లికి తగ్గ కూతురుగా పేరు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.ఈ సమయంలోనే ఈ అమ్మడు చేసిన చిత్రం గుంజన్ సక్సేనా.
ఈ చిత్రం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ సందర్బంగా తెరకెక్కిన విషయం తెల్సిందే.తాజాగా గుంజన్ సక్సేనా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓటీటీ ద్వారా విడుదల అయిన ఈ సినిమాకు విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.ఇదే సమయంలో కొందరు ప్రేక్షకులు మాత్రం నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీకపూర్ జీవించింది.ఒక అమ్మాయి అదీ సాదారణ అమ్మాయి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎలా అయ్యింది.అందుకు సంబంధించి ఎలాంటి ఆమె పడ్డ తపన ఏంటీ అనేది జాన్వీ కపూర్ చూపించడంలో సక్సెస్ అయ్యింది.రివ్యూవర్స్ వ్యూ లో చూస్తే సినిమాకు పాజిటివ్ మార్కులు పడ్డాయి.
అయితే ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న నెపొటిజం కారణంగా చాలా మంది నెటిజన్స్ ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు.జాన్వీ కపూర్కు కేవలం వారి కుటుంబ సభ్యుల కారణంగానే ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు.
బాలీవుడ్లో జాన్వీ కపూర్ ఈ స్థాయిలో ఉందంటే అది ఖచ్చితంగా నెపొటిజం వల్లే అంటున్నారు.అలాంటి నెపోటిజంతో స్టార్గా ఎదిగినా జాన్వీ కపూర్కు గౌరవం ఉండదని అంటున్నారు.
గుంజన్ సక్సేనా సినిమా బాగున్నా కూడా సుశాంత్ మృతి కేసు ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతుంది కనుక సినిమాపై నెగటివ్ కామెంట్స్ మెజార్టీగా వస్తున్నాయి.ఈ విషయంలో జాన్వీ కపూర్ తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది.
ఈ సినిమా రాంగ్ టైంలో వచ్చిందేమో అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సుశాంత్ ఇష్యూ సమసి పోయిన తర్వాత వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అంటున్నారు.