బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.జాన్వీ కపూర్ దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె అన్న విషయం మనందరికీ తెలిసిందే.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.మొదట దడక్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ.
ఇటీవలే ఆమె నటించిన మిలి చిత్రం సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకున్న తెలిసిందే.సినిమాలో ఆమె నటనకు గాను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది.తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది జాన్వీ కపూర్.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంది.ఈ మధ్యకాలంలో తన అందాల ఆరబోత విషయంలో కాస్త డోస్ ని పెంచేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో జాన్వీ కపూర్ బ్లాక్ డ్రెస్ ను ధరించింది.అయితే ఆ ఫోటోలు చూసినా నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.
మీరు ఎందుకు కైలీ జెన్నర్ను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించారు.మరొక నెటిజెన్ అయితే కైలీ జెన్నర్ లైట్ వెర్షన్ అంటూ కామెంట్స్ చేశారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జాన్వీ కపూర్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.
ఇకపోతే ఈ కైలి జెన్నర్ ఎవరు అన్న విషయానికి వస్తే. కైలీ క్రిస్టెన్ జెన్నర్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త.
రియాలిటీ టెలివిజన్ సిరీస్ కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్ 2007 నుంచి 2021 వరకు నటించారు.కైలీ కాస్మెటిక్స్ కంపెనీకి ఆమె యజమానిగా కూడా ఉన్నారు.
ఇన్స్టాగ్రామ్లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా నిలిచారు.ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది.