బాహుబలి తర్వాత మన ఇండస్ట్రీ నుండి చెప్పుకోదగ్గ పాన్ ఇండియన్ సినిమాలు చాలానే వస్తున్నాయి.అందుకే మన సౌత్ సినిమా స్థాయి ముఖ్యంగా టాలీవుడ్ స్థాయి పెరిగింది.
దీంతో మన ఇండస్ట్రీ నుండి భారీ పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.వీటిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.
మరి మన స్థాయి పెరగడంతో మన స్టార్ హీరోలతో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే బాహాటంగానే మన స్టార్ హీరోలతో నటించాలని ఉంది అని బిటౌన్ ముద్దుగుమ్మలు చెబుతూ మన హీరోల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది మన తెలుగు స్టార్స్ తో నటిస్తున్నారు.మరి బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఉంది.ఈమె కూడా చాలా రోజులుగా తెలుగు మూవీ చేయడం కోసం ఎదురు చూస్తుంది.
ఈ క్రమంలోనే ఈమెకు అదిరిపోయే అవకాశం వచ్చింది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని వార్తలు వచ్చాయి.ఈమె ఈ సినిమా కోసం సైన్ చేసింది అని అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ టాక్ వచ్చింది.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఈమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందట.
మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని ఈ సినిమా ఈమెకు మొదటి పాన్ ఇండియన్ సినిమా కాబోతుండడంతో జాన్వీ చాలా ఉత్సాహంగా ఉందట.మరి మార్చి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.ఈ సినిమా 2024, ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.