యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రారంభించాడు.ఈ సినిమాలో తారక్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించనున్నాడు.
ఇక ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు.ఈ సినిమాలో ఇద్దరు హీరోలయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయినను పోయి రావలె హస్థినకు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో తొలుత పూజా హెగ్డే లేదా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.
కానీ బాలీవుడ్ బ్యూటీ, అలనాటి బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్గా ఉంటుందనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఎన్టీఆర్ సినిమాతో సౌత్లో ఎంట్రీ ఇస్తున్నట్లు వచ్చిన వార్తలపై జాన్వీ కపూర్ స్పందించింది.
తాను ఇంకా ఎలాంటి తెలుగు సినిమాను ఓకే చేయలేదని, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.దీంతో ఆమె ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం అయ్యింది.