రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాని పూర్తి చేసే పనిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.ఈ సినిమా ద్వారా తారక్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతున్నాడు.
ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలో నటించడానికి రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యింది.
ఇక త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసేశాడు.దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఆవిష్కరించడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఇద్దరి భామల మధ్య పోటీ నెలకొని ఉంది.అందులో ఇప్పటికే త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే ఒకరు కాగా, టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్ ఒకరు.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.ఓ వైపు తెలుగు సినిమాలు, మరో వైపు హిందీ సినిమాలకి సైన్ చేస్తూ తన స్పీడ్ చూపిస్తుంది.
వరుస విజయాలతో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే సౌత్ తో పాటు, బాలీవుడ్ లో కూడా హవా కొనసాగించాలని చూస్తుంది.ఇక రాదేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాతో సత్తా చాటడానికి రెడీ అవుతుంది.
ఎన్టీఆర్ సినిమాలో కూడా తానే నటిస్తానని పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ కి మాట ఇచ్చినట్లు తెలుస్తుంది.అయితే జాన్వీ కపూర్ ని తెలుగులో పరిచయం చేయడానికి ఎన్టీఆర్ బెస్ట్ ఛాయస్ అని బోనీ కపూర్ త్రివిక్రమ్ ని సంప్రదించి జాన్వీని పరిచయం చేయాలని కోరినట్లు టాక్ వినిపిస్తుంది.
జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ తో జత కట్టడానికి ఆసక్తిగానే ఉంది.ఈ నేపధ్యంలో ఈ ఇద్దరు భామల మధ్య ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం ఆసక్తికరమైన పోటీ నడుస్తుంది.
అయితే సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని మరో టాక్ కూడా వినిపిస్తుంది.