కొన్ని సినిమాలకు షూటింగు దశలోనే విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.ఆ చిత్రం పంపిణీ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు.ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి కూడా అటువంటి క్రేజే ఏర్పడింది.‘శ్రీమంతుడు’ వంటి భారీ హిట్టు తర్వాత దర్శకుడు కొరటాల శివ చేస్తున్న చిత్రం కావడం … ‘నాన్నకు ప్రేమతో’ వంటి విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఇది మార్కెట్లో హాట్ కేకులా వుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం నెల్లూరు ఏరియా హక్కులు ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.2.34 కోట్ల రికార్డు ధరకు ఈ హక్కులు వెళ్లినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.