ఈనెల 20 వ తేదీన కడప జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేయనున్నారని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రతి కౌలు రైతు కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ.లక్ష సొంత నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా రైతు కుటుంబాలకు జనసేన ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.
అనంతరం సీఎం జగన్ సొంత జిల్లాలో కూడా రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు.రైతు భరోసా కేంద్రాలకు రూ.వేల కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్న వైసీపీ నేతల మాటలు బూటకమని విమర్శించారు.