పవన్కళ్యాణ్ జనసేన 2019 ఎన్నికల్లో ఏపీలో ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న అంశంపై అప్పుడే రకరకాల అంచనాలు స్టార్ట్ అయ్యాయి.గత ఎన్నికల్లో జనసేన టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు పలికింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన చాలా వరకు సొంతంగానే పోటీ చేసే సూచనలు ఉన్నాయి.మహా అయితే ఏ కమ్యూనిస్టులతోనే జనసేన పొత్తు ఉంటుంది.
ఇక వచ్చే ఎన్నికలపై జనసేన ప్రభావం ఎలా ఉంటుంది అన్న అంశంపై ఆ పార్టీ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటోంది.
తాజాగా జనసేన ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలో వచ్చిన ఫలితాలు విశ్వసనీయవర్గాల ద్వారా బయటకు లీక్ అయ్యాయి.
ఈ ఫలితాల్లో ఏపీలోని మొత్తం 175 సీట్లలో టీడీపీకి 71, జనసేనకు 65, వైసీపీకి 39 సీట్లు వస్తాయని తేలిందని సమాచారం.ఇక జిల్లాల వారీగా చూస్తే ఆ ఫలితాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం: టీడీపీ 5 – జనసేన 5 – వైసీపీ 0 విజయనగరం: టీడీపీ 5 – జనసేన 4 – వైసీపీ 0 విశాఖపట్నం: టీడీపీ 6 – జనసేన 9 – వైసీపీ 0 తూర్పుగోదావరి: టీడీపీ 3 – జనసేన 15 – వైసీపీ 1 పశ్చిమగోదావరి: టీడీపీ 3 – జనసేన 12 – వైసీపీ 0 కృష్ణా : టీడీపీ 10 – జనసేన 6 – వైసీపీ 0 గుంటూరు: టీడీపీ 10 – జనసేన 5 – వైసీపీ 2 ప్రకాశం: టీడీపీ 5 – జనసేన 3 – వైసీపీ 4 నెల్లూరు: టీడీపీ 3 – జనసేన 4 – వైసీపీ 3 కడప: టీడీపీ 0 – జనసేన 0 – వైసీపీ 10 కర్నూలు: టీడీపీ 4 – జనసేన 0 – వైసీపీ 10 అనంతపురం: టీడీపీ 10 – జనసేన 0 – వైసీపీ 4 చిత్తూరు: టీడీపీ 7 – జనసేన 3 – వైసీపీ 4
ఈ సర్వే ప్రకారం గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభంజనం క్రియేట్ చేయనుంది.ఇక సీమలో మాత్రం జనసేన బాగా వెనకపడింది.
సీమలో వైసీపీ మరోసారి సత్తా చాటుకుంది.ఇక ఓవరాల్గా టీడీపీకి అత్యధికంగా 71 సీట్లు రాగా, జనసేకు 65, వైపీపీకి 39 సీట్లు వచ్చాయి.
ఈ లెక్కన చూస్తే 2019లో ఏపీలో హంగ్ ఏర్పడడం ఖాయంగా ఉంది.మరి 2019 ఎన్నికల నాటికి ఇంకెన్ని లెక్కలు మారతాయో చూడాలి.