జనసేన పార్టీ నుంచి ఈ ఎన్నికల బరిలో పోటీ పడే అభ్యర్ధుల మొదటి జాబితాలో 32 మంది అసెంబ్లీ అభ్యర్ధులని ప్రకటించిన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో 32 అసెంబ్లీ సభ్యులతో కూడిన రెండో జాబితాని రిలీజ్ చేసారు.అలాగే 5 లోక్ సభ సీట్లకి అభ్యర్ధులని ఖరారు చేసారు.
ఇందులో తెలంగాణలో సికింద్రాబాద్ కూడా ఉండటం విశేషం.ఇందులో మెజారిటీ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు జిల్లా అభ్యర్ధులపై జనసేనాని ఎక్కువగా ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది
అలాగే విశాఖలో అనకాపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు బంధువు నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ టికెట్ కోసం పని చేసిన పరుచూరి భాస్కరరావుకి ఊహించని విధంగా జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు.
దీంతో అతను జనసేన పార్టీలో చేరినట్లు స్పష్టం అవుతుంది.అలాగే ఈ లిస్టు లో ముఖ్యంగా నలుగురు మహిళలకి స్థానం కల్పించారు.