నూతన్ నాయుడు ఇష్యూలో జనసేనని టార్గెట్ చేస్తున్న వైసీపీ

విశాఖ జిల్లా పెందుర్తిలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి దొంగతనం చేసాడనే నెపంతో శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే.దీనిపై ఆ యువకుడు పోలీసులని ఆశ్రయించడంతో నూతన్ నాయుడు భార్యతో పాటు ఆ ఇంట్లో పనిచేసే వారిపై కేసు నమోదైంది.

 Janasena Responds On Nutan Naidu Issue, Visakhapatnam, Ycp, Janasena, Nutan Naid-TeluguStop.com

ఈ ఘటన జరిగిన తర్వాత సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ పవన్ కళ్యాణ్, జనసేనని టార్గెట్ చేస్తున్నారు.నూతన్ నాయుడు జనసేన నాయకుడు అని ప్రచారం చేస్తున్నారు.

ఆ పార్టీ మీద ఇష్టానుసారంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

దీనికి కారణం కూడా ఉంది.

ఆ మధ్య వర్మకి వ్యతిరేకంగా నూతన్ నాయుడు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరాన్నజీవి అనే సినిమాని తెరకెక్కించారు.ఆ సమయంలో నూతన్ నాయుడు తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని అన్ని మీడియా చానల్స్ లో కూడా చెప్పుకున్నాడు.

గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పని చేసినట్లు చాలా ఇంటర్వ్యూలలో నూతన్ నాయుడు చెప్పాడు.దీనిని పాయింట్ గా చేసుకొని వైసీపీ సోషల్ మీడియా గ్రూపులలో జనసేనకి శిరోమండనం ఇష్యూ అంటగడుతూ హడావిడి చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దీనిపై జనసేన పార్టీ స్పందించింది.శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అని, ఆయన జనసేన పార్టీలో ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో పవన్ కల్యాణ్ పేరును తీసుకురావడం సరికాదని స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube