తెలంగాణ లోక్ సభ ఎన్నికలకి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి తన పార్టీ నుంచి 12 మంది ఎంపీ అభ్యర్ధులని ఖరారు చేసింది.ఈ రోజు అధినేత కేసీఆర్ తన ఎన్నికల పర్యటనకి శ్రీకారం చుట్టారు.
ఇదిలా ఉంటే మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులని ప్రకటించే పనిలో ఉన్నారు.ఇప్పటికే 8 అభ్యర్ధులతో మొదటి జాబితాని ప్రకటించడం వారు ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగిపోయింది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడటానికి సిద్ధం అయ్యింది.ఇప్పటికే మల్కాజ్ గిరి అభ్యర్ధిగా బి మహేందర్ రెడ్డిని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు.
ఇక మిగిలిన అభ్యర్ధుల కోసం స్క్రీనింగ్ టెస్ట్ కి పిపులు ఇచ్చారు.దీని కోసం చాలా మంది జనసేన పార్టీ నుంచి ఎంపీలు బరిలో నిలబడటానికి ఆసక్తి చూపిస్తూ స్క్రీనింగ్ కి హాజరు కావడం విశేషం.
ఈ ప్రక్రియని వీలైనంత వేగంగా పూర్తి చేసి జనసేన అభ్యర్ధులని ప్రకటించడానికి పవన్ సిద్ధం అవుతున్నారు.