ఏపీ ప్రయోజనాల కోసమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్దం అయినట్లుగా జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.బీజేపీతో కలిసి నడవడం వల్ల పలు ప్రయోజనాలు రాష్ట్రంకు వస్తాయనే ఉద్దేశ్యంను ఆయన వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా జనసేన పోరాటం చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.ఈ పోరాటంను తెలుగు దేశం పార్టీతో కలిసి చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
2014 ఎన్నికల్లో బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలకు జనసేన మద్దతు ఇచ్చిన విషయం తెల్సిందే.మొన్నటి ఎన్నికల్లో జనసేన సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసింది.
మూడు పార్టీలు మూడు ముక్కలు అయ్యి పోటీ చేయగా ఏ పార్టీకి స్పష్టమైన సీట్లు రాలేదు.దాంతో వైకాపాకు లాభం చేకూరింది.
వైకాపా అధికారంలోకి వచ్చింది.మళ్లీ జనసేన ఈ మూడు పార్టీల కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.
జగన్ కంటే బాబు బెటర్ అనే ఉద్దేశ్యానికి ఇప్పటికే ప్రజలు వచ్చారని అందుకే బాబుకు మద్దతుగా ఉంటే ఆయన అధికారంలోకి వస్తాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.