ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు పరిశీలిస్తే గిద్దలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును, జనసేన కార్యకర్త అయినా బండ్ల వెంగయ్య నాయుడు తమ గ్రామంలోని రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే రాంబాబును నడి రోడ్డుపై కారు ఆపి నిలదీయడంతో నువ్వెవుడి రా నాకు చెప్పడానికి, ఒళ్లు దగ్గర పెట్టుకో, నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిటాడట.
ఈ తరుణంలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకో వలసిందేనా అని భావోద్వేగం చెందుతూ, వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని అంతే కాకుండా ఇతని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.