2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యే గెలిచింది రాపాక వరప్రసాద్.జనసేన పార్టీ నుండి రాపాక వరప్రసాద్ గెలిచిన గాని ఎక్కువగా మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు.
వైయస్ జగన్ ని అసెంబ్లీలో అదే విధంగా మీడియా ముందు అనేకసార్లు పొగడటం జరిగింది.అంతే కాకుండా తన కుమారుడిని జగన్ సమక్షంలో రాపాక వైసీపీ పార్టీలో జాయిన్ చేయడం కూడా జరిగింది.
ఇలాంటి తరుణంలో పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ కార్యకర్తని ఫోన్ లో రాపాక దుర్భాషలాడటం ఆ ఆడియో సోషల్ మీడియా లో లీక్ అవడంతో ఆయనపై తీవ్ర విమర్శలు రావటమే కాక ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది.
నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సహదేవ్ కు ఇటీవల ఎమ్మెల్యే రాపాక ఫోన్ చేసి నా నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టడానికి నువ్వు ఎవరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నువ్వు నిర్ణయించావా? అన్ని ప్రశ్నించగా లేదన్నా అమ్మాజీ గారు నిర్ణయించారని సహదేవ్ చెప్పాడు.నా గ్రామానికి వచ్చి వైసీపీ అభ్యర్థిని ప్రెసిడెంట్గా గెలిపిస్తావా వైసీపీ వాళ్లంతా పోరంబోకులు తయారయ్యారంటూ మండిపడ్డారు.
ఎవడ్రా నువ్వు వెధవ అంటూ రాయలేని పదజాలంతో దుర్భాషలాడారు.ఇదే క్రమంలో నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి పెదపాటి అమ్మాజీని కూడా రాపాక వరప్రసాద్ విమర్శించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల విషయంలో పెదపాటి అమ్మాజీ ఆయన అనుచర వర్గం తనని పట్టించుకోకుండా వ్యవహరించటం తోనే రాపాక వరప్రసాద్ ఈ స్థాయిలో సీరియస్ అయినట్టు నియోజకవర్గంలో వార్తలు వస్తున్నాయి.
.