తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక తీరుపై జనసేన కమిటీ చైర్మన్ ఆగ్రహం.. ?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముగిసింది.కానీ ఈ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు.

 Janasena Committee Chairman Nadendla Manohar Angry Over Tirupati Lok Sabha By El-TeluguStop.com

ఇప్పటికే లోక్‌సభ ఉప ఎన్నిక పై టీడీపీ గరం గరంగా ఉండగా, ఆ పార్టీ నేతలు ఎన్నికల తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ ఉప ఎన్నిక జరిగిన తీరుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అధ్వర్యంలో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందని, దొంగ ఓట్లు వేయడానికి మరీ పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చారని ఆరోపించారు.ఇదంతా అధికారులు, పోలీసుల సాయంతోనే పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు.

అయితే ఇలా దొంగ ఓట్లు వేయడం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగమేనా అని వ్యంగంగా దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.ఇకపోతే ఈ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై బీజేపీతో కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube