తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముగిసింది.కానీ ఈ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు.
ఇప్పటికే లోక్సభ ఉప ఎన్నిక పై టీడీపీ గరం గరంగా ఉండగా, ఆ పార్టీ నేతలు ఎన్నికల తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్న విషయం తెలిసిందే.కాగా తాజాగా ఈ ఉప ఎన్నిక జరిగిన తీరుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అధ్వర్యంలో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందని, దొంగ ఓట్లు వేయడానికి మరీ పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చారని ఆరోపించారు.ఇదంతా అధికారులు, పోలీసుల సాయంతోనే పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు.
అయితే ఇలా దొంగ ఓట్లు వేయడం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగమేనా అని వ్యంగంగా దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.ఇకపోతే ఈ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై బీజేపీతో కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.