ఏపీ ఎంపీ అరెస్టు పై స్పందించిన జనసేన అధినేత.. ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

 Janasena Chief Responds To Ap Mp Raghurama Krishna Raju- Rrest Ap, Janasena, Paw-TeluguStop.com

ఇదిలా ఉండగా సొంత పార్టీ నేతల పైనే గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న ఇంత కాలం మౌనంగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఒక్క సారిగా రఘురామను అరెస్ట్ చేసిన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.అయితే వైసీపీ ఎంపీలు మాత్రం రఘురామ అరెస్ట్‌ను సమర్దించుకొంటుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నాయి.

ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై తీవ్రస్థాయిలో స్పందించారు.ప్రజలంతా కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే, వారి సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం తమను విమర్శిస్తున్నారు అనే ఒకే ఒక నెపంతో రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube