వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును నిన్న ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా రఘురామరాజుపై ఐపీసీ- 124 ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా సొంత పార్టీ నేతల పైనే గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న ఇంత కాలం మౌనంగా ఉన్న ఏపీ ప్రభుత్వం ఒక్క సారిగా రఘురామను అరెస్ట్ చేసిన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.అయితే వైసీపీ ఎంపీలు మాత్రం రఘురామ అరెస్ట్ను సమర్దించుకొంటుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నాయి.
ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై తీవ్రస్థాయిలో స్పందించారు.ప్రజలంతా కరోనా కొరల్లో చిక్కుకుని అల్లాడుతుంటే, వారి సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం తమను విమర్శిస్తున్నారు అనే ఒకే ఒక నెపంతో రఘురామ కృష్ణరాజును అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.