అన్నీ కూల్చివేస్తేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది అంటున్న పవన్

గత ప్రభుత్వం హయం లో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా నది కరకట్ట వద్ద ప్రజావేదిక నిర్మాణం జరిగింది.

 Janasena Chief Pawan Kalyan Reacts On Demolishing Prajavedika-TeluguStop.com

అయితే ఈ నిర్మాణం అక్రమ కట్టడం అని వైసీపీ పార్టీ ఆరోపిస్తూ ఇప్పుడు అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజావేదిక ను కూల్చి వేయాలని నిర్ణయించింది.దీనితో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం తో టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం తమ చర్యను సమర్ధిస్తూ టీడీపీ నేతలపై ఫైర్ అవుతున్నారు.అయితే ఈ ప్రజావేదిక కూల్చివేత పై తొలిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

గుంటూరు జిల్లా నంబూరు లో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రధమ వార్షిక బ్రహ్మోత్సవం లో పాల్గొన్న పవన్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా 108 కలశాలతో అక్కడ పూజారులు జరిపిన పూజలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజావేదిక కూల్చివేత పై స్పందించారు.అక్రమకట్టడాల కూల్చివేత ఒక్క ఈ ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని వ్యాఖ్యానించారు.

అనుమతిలేని అన్ని భవనాలను కూల్చివేస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్థాయి లో నమ్మకం కలుగుతుందని పవన్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube