జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని దేవాలయాలపై జరిగిన దాడుల గురించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాడు.అసలు ఏపీలో దేవాదాయ శాఖ అనేది ఉన్నదా అని ప్రశ్నించాడు.
రామతీర్థం రామాలయం ఘటన మరువక ముందే రాజమహేంద్రవరంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో కొంతమంది దుండగులు అక్కడ ఉన్న సుబ్రమణ్య స్వామి విగ్రహాం చేతులు విరగొట్టడంపై పవన్ కళ్యాణ్ జగన్ పై విమర్శలు చేశాడు.ఆలయాల రక్షణలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నాడు.
రాముడు తిరిగాడిన మన నేలపై నేడు ఆయనకే రక్షణ లేకుండా పోయిందని అన్నాడు.మనం రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం.
రామాయణం రాస్తూ ఆ రాముడిని కొలుస్తాం.
రాముడి లేని గుడి కానీ ఊరు కానీ లేదని గుర్తుచేశాడు.
ఏపీలో రాముడి గుర్తులను ఆ భావనలను చెరిపేయ్యాలని వైసీపీ పార్టీ చూస్తుందని అన్నాడు.ఆ దేవుడితో చెలగాటం అడితే ఆ దేవుడే శిక్షిస్తాడని అన్నాడు.
జగన్ ను ముఖ్యమంత్రి అనాలంటేనే మాటలు రావడంలేదు అన్నాడు.అన్నీ మతాలకు చెందిన పెద్దలు ఒక వేధికపైకి వచ్చి ఆలయాలపై విగ్రహా ద్వంసంలపై జరుగుతున్నా దాడులను, రథాలు తగలబెట్టడాని ఖండించాలని కోరాడు.
నేడు హిందువుల ఆలయాలకు జరిగిన సంఘటనలు ఫ్యూచర్ లో వేరే మతాలకు చెందిన వాటిపై జరగవచ్చని అన్నాడు.అందుకే అందరం ఇక్యతతో ఉండి ఇలాంటివి జరగకుండా చూడాలని జనసేనాని అన్నాడు
.