ముగిసిన 'సేనాని' రైలు ప్రయాణం !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వినూత్నంగా చేపట్టిన ‘సేనానితో రైలు ప్రయాణం’ ముగిసింది.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైలు యాత్ర జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తుని వరకు ప్రయాణించారు.

 Janasena Chief Pavan Kalyan Train Journy Completed Succsefully-TeluguStop.com

తుని వరకు ప్రయాణం సాగించిన పవన్‌కు అక్కడ అభిమానులు ఘనస్వాగతం చెప్పారు.పవన్ కూడా ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు చాలా ఉత్సాహంగా కనిపించారు.

రైలు ప్రయాణంలో భాగంగా ఈ మధ్యాహ్నం విజయవాడ రైల్వే స్టేషన్‌కు వచ్చిన పవన్‌కు రైల్వే కూలీలు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పవన్ రైలులో చిరు వ్యాపారులను కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రైలు నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం మీదగా సాయంత్రం తుని చేరుకున్నారు.ఈ రైలు యాత్ర అనుకున్నట్టుగానే సక్సెస్ ఫుల్ గా పూర్తవడంతో జనసేన వర్గాలు ఆనందంలో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube