వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై మరోసారి విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.రైతుల ఆత్మహత్యలపై జగన్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడ్డం తగదని పవన్ విమర్శించారు.
అధికారం కోసం ప్రజలకు ముద్దులు పెట్టడమో, పాదయాత్ర చేస్తే రైతులకు కడుపు నిండదని పవన్ జగన్ కు సూచించారు.అన్నదాతల్లో దాదాపు 60 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కేవలం కొంతమంది రైతులు కే పరిమితం చేయడం వారికి అన్యాయం చేయడమేనని పవన్ వ్యాఖ్యానించారు.
జగన్ పాలన ప్రజలందరికీ మేలు చేసేలా ఉంటే తాను రోడ్ల వెంట ఎందుకు తిరగాల్సి వస్తుంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రిగా జగన్ 30 ఏళ్లు పాలిస్తే రైతులు మిగలరని, వారికి ఆత్మహత్యలే శరణ్యమని, జగన్ పాలనపై అప్పుడే జనాలకు విసుగొచ్చేసిందని పవన్ అన్నారు.
పవన్ చేస్తున్న విమర్శలపై వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు వస్తున్నా పవన్ మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడంలేదు.జనసేన బీజేపీ త్వరలోనే కలవబోతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఈ విధంగా దూకుడు పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది.