ప్రస్తుతం జనసేన పార్టీలో సందడి వాతావరణం నెలకొంది.పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఒక వైపు… పార్టీలో చేరే వారు మరొకవైపు ఇలా రోజుకో కొత్త కొత్త పరిణామాలు ఆ పార్టీలు చోటుచేసుకుంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఏపీ లోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న జనసేన పార్టీ సమర్థులైన అభ్యర్థులను ఆయా నియోజకవర్గాల్లో దించేందుకు చూస్తోంది.ఇప్పటికే ఆయా సీట్లలో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో అభ్యర్థి ఎవరనే విషయం తేల్చేందుకు స్క్రీనింగ్ కమిటీ సిద్దం అవుతోంది.
ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీకి అప్లికేషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనే విషయమై అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.
అయితే పవన్ ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, అనంతపురం ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో ఉన్న గాజువాక పేరు తెరపైకి వచ్చింది.గాజువాక నుంచి పవన్ తో పోటీ చేయిస్తే పార్టీకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భావిస్తున్నారట.అది కాకుండా ఏపీలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో… అక్కడి నుంచి పోటీ చేస్తే బంపర్ మెజారిటీతో ఆయన గెలవడం ఖాయం అని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.