జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా పశ్చిమగోదావరి కి రేపు రానున్నారు.ఇదే జిల్లాలోని పెనుగొండ లో ఉన్న ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతను ఆయన దర్శించుకునేందుకు వెళ్లబోతున్నారు.
ఈ సందర్భంగా అక్కడ వాసవి మాత ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో పెనుగొండకు చేరుకొని … అక్కడ మార్కెట్ యార్డ్ నుండి రోడ్డు మార్గం ద్వారా వాసవి ఆలయానికి చేరుకుంటారు.
అక్కడ జరగనున్న 90 అడుగుల వాసవీమాత విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు.ఈ మేరకు పార్టీ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
.