విశాఖ మున్సిపల్ ఎన్నిక ఫలితం కోసమే రాష్ట్రం వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారట.దీనికి కారణం ప్రస్తుతం విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం తీవ్రమైంది.
ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందా లేదా అన్నది ఈ ఫలితాలతో తేలిపోనుంది.అందుకే ఈ ఎన్నికలపై ప్రజలు ఫోకస్ చేశారట.
ఇదిలా ఉండగా ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో విషాదం నెలకొంది.
ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయానికి అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరగగా, ఈ కారణంగా జనసేన అభ్యర్థి ఒకరు మృతి చెందారట.
విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండె పోటుతో మృతి చెందారని సమాచారం.దీంతో విశాఖ వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది.
కాగా విశాఖ ఉక్కు ఉద్యమం తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది.మరోవైపు యూత్ ఓట్లు అధికంగా ఉండడంతో తమకు ప్లస్ అవుతుందని జనసేన భావిస్తోంది.
దీంతో మూడు పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నాయి.మరి తుది తీర్పు వస్తే గానీ తెలియదు ప్రజలు ఎవరికి పట్టం కట్టారో అని.