జనసేన పార్టీ తరుపున గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు.అయితే గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రాపాకకి మద్యం దూరం పెరుగుతూ వస్తుందని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది.
అందుకు తగ్గట్లుగానే బుధవారం ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం మీద మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీ నిర్ణయాన్ని సమర్ధించారు.ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టడం ద్వారా మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.
అదే సమయంలో ఇంగ్లీష్ మీడియంని వ్యతిరేకించడం సరైన పద్ధతి కాదు అన్నట్లు మాట్లాడారు.ఇదే సమయంలో అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత దిశ సంఘటన మీద మాట్లాడిన మాటలని కూడా తప్పు పట్టారు.
అత్యాచారం చేసినవాళ్ళకి రెండు బెత్తం దెబ్బలు వేసి వదిలేయండి అన్నట్లు పవన్ మాట్లాడటం కరెక్ట్ కాదన్నట్లు చెప్పారు.అలాగే కాకినాడలో జరగే రోతు సౌభాగ్య దీక్షకి కూడా వెల్లలేలని స్పష్టం చేసాడు.
ఇన్ని విధాలుగా జనసేన పార్టీ సిద్దాంతాలకి విరుద్ధంగా వెళ్ళిన రాపాకపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ చర్యలకి సిద్ధమయ్యారని టాక్ వినిపించింది.అందుకు తగ్గట్లుగానే ఈ రోజు సోషల్ మీడియాలో రాపాక వరప్రసాద్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీసులు జారీ చేసారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది.
ఆ షోకాజ్ నోటీసు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది.కాకినాడ దీక్షకి ఎందుకు రాలేదో రెండు రోజులలో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో రాపాకని పవన్ ప్రశ్నించినట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే ఇందులో వాస్తవం లేదని జనసేన సోషల్ మీడియా చెబుతుంది.ఫేక్ షోకాజ్ నోటీస్ సృష్టించి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు.మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.