త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.అయితే ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి సొంతం.
అయితే కేసీఆర్ హవా తీవ్రంగా నడుస్తున్న తరుణంలో తన ప్రత్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో 7 వేల ఓట్లతో ఓడిపోయాడు.అయితే దురదృష్ట వశాత్తు నోముల నర్సింహయ్య మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఇక జానాకు మరో ఛాన్స్ వచ్చింది.
అయితే నాగార్జున సాగర్ గెలుపుకు మంత్రులతో సహా అందరు తీవ్రంగా శ్రమిస్తున్న సందర్భంలో జానా రెడ్డి స్పందించారు.మంత్రులంతా పర్యటించినా నా గెలుపును ఆప లేరని జానా రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక ఇప్పటి నుండే కాంగ్రెస్- టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.అయితే ఇప్పటికే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ వ్యూహాలకు ధీటుగా వ్యూహ రచన చేస్తోంది.
అయితే జానా రెడ్డి తాను హయాంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి నన్ను మరల గెలిపిస్తాయని జానారెడ్డి నమ్మకంగా ఉన్నారు.