తెలంగాణలో త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసాయి.
అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏదైతే తప్పు చేసిందో, ఈ ఎన్నికలలో కూడా అదే తప్పు చేస్తోంది కాంగ్రెస్.
కాంగ్రెస్ లో మనం తరచూ చూసేది ఐకమత్యలోపం.పార్టీ కంటే తమ వ్యక్తిగత స్వార్థానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.
పార్టీకి భవిష్యత్తు లేకపోతే తమ భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందనే విషయాన్ని మర్చిపోతోంటారు కాంగ్రెస్ నాయకులు.ఇప్పుడు కూడా ఇదే సీన్ ను రిపీట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఎన్నికలో గెలిచే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితులలో కాంగ్రెస్ నాయకులు జానా రెడ్డిని ఒంటరిగా వదిలేసారని తెలుస్తోంది.ఒకవేళ జానారెడ్డి గెలిస్తే మరల కాంగ్రెస్ లో జానారెడ్డి పాపులర్ అయి కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తే, ఆ తరువాత తమ ప్రాధాన్యానికే ఎసరు వస్తుందని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే జానా ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు కొంత మంది ప్రచారానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.