'JGM' నిజంగా అదే కాన్సెప్ట్ నా.. అయితే వివాదం చెలరేగడం ఖాయం!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా లైగర్.

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే కాంబో లో పాన్ రాబోతున్న విషయం విదితమే.పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా కూడా విజయ్ తోనే చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక సైనిక పాలనకు సంబందించిన స్టోరీ ఇది అని.తెలుస్తుంది.ప్రభుత్వం ఉండగా ఆర్మీ చేసే విధులు ఏంటి దేశాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ ఏం చేస్తుంది అనేది స్టోరీ అంటూ వార్తలు వస్తున్నాయి.

మరి ఇదే స్టోరీ అయితే దేశంలో ఆర్మీ పరిపాలన అనేది వివాదాస్పద అంశంగా చెప్పాలి.అందుకే ఈ స్టోరీతో పూరీ సినిమా తీస్తే ఈ సినిమా రిలీజ్ వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ వార్త పుకార్లు అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ మరో వార్త కూడా వస్తుంది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు