జమున గారు ఆ మాట అనగానే.. చేత్తో ఆమె నోటిని మూసేసారు బాలయ్య.! ఎందుకో తెలుసా.?

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి అందరికి తెలిసిందే.ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సూపర్‌స్టార్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్లు, మంచు మోహన్ బాబు, దర్శకధీరుడు రాఘవేంద్రరావు, కృష్ణం రాజు, పరుచూరి బ్రదర్స్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, టి.

 Jamuna At Ntr Biopic Audio Launch-TeluguStop.com

సుబ్బరామిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌, తారకరత్న‌, కొరటాల శివ, సీనియర్ నరేశ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకకు హాజరైన జామున గారు మాట్లాడుతూ…బిడ్డలు తల్లిదండ్రుల పేరు నిలబెట్టడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం.బాలయ్య తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.తండ్రికి తగ్గ తనయుడే కాదు తండ్రిని మించిన అని అనబోతుండగానే బాలయ్య జామున గారి నోటిని చేత్తో మూసేసారు.

ఆమె నవ్వుతూ తండ్రిని మించిన తనయుడు ఎందుకు అన్నానంటే.ఎన్టీఆర్ గారు పౌరాణికాలు, జానపదాలు ఇలా కొన్ని వందల చిత్రాలు చేశారు.అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్రని మరోమారు మనకు చూపించడం పెద్ద సాహసం అని జమున అన్నారు.

నందమూరి తారక రామరావు నలుగురు కూతుళ్లు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయించారు.ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది.నందమూరి అభిమానులకి ఈ సినిమా పెద్ద పండగే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube