జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.జమ్మూకాశ్మీర్ లో తరచూ పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

 Jammukaslmeer Governor Malik Unbelievable Message To Kashmir People-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆయన ఒక కార్యక్రమం లో మాట్లాడుతూ నిత్యం ప్రజలను కాపాడుతూ వారికి రక్షణ గా నిలిచే పోలీసులను చంపడం కంటే,అవినీతి చేసే రాజకీయ నేతలని చంపాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఒకరకంగా ఉగ్రవాదులకు పోలీసులను కాదు రాజకీయ నేతల్ని టార్గెట్ చేసి చంపాలి అని సూచించినట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

దీనితో ఆయన వ్యాఖ్యలపై ఒక్కసారిగా అక్కడ పెద్ద దుమారమే రేగింది.ఒక రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సత్యపాల్ ఈ విధంగా ఉగ్రవాదులకు సూచించడం సరికాదు అంటూ పలువురు ప్రాముఖ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

టెర్రరిస్టులు పోలీసులను చంపుతున్నారు.

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపా

భద్రతా బలగాలను చంపుతున్నారు.ఎస్‌పీఓలను చంపుతున్నారు.ఇలాంటి వారిని చంపడం కంటే ప్రజల ఆస్తుల్ని దోచుకునే రాజకీయ నేతల్ని, అవినీతికి పాల్పడే అధికారులపై తమ ప్రతాపాన్ని చూపాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.

కొంపతీసి గవర్నర్ గారి సూచనలను ఉగ్రవాదులు పాటిస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube