భారత్ పాక్ సరిహద్దు ప్రాంతం జమ్మూకాశ్మీర్లో ఎప్పుడు అల్లర్లు.ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతాయి అన్న సంగతి తెలిసిందే.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడుగుపెట్టిన తర్వాత కాస్త అల్లర్లు తగ్గటం మాత్రమే కాక జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా భారత్ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది.ఇదిలావుంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వాళ్లు.
ఆందోళనలు నిరసనలు చేపడుతూ రాళ్లు విసిరే రీతిలో వ్యవహరించడంతో.జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.
విషయంలోకి వెళితే ఎవరైతే రాళ్ళు విసురుతారో.అటువంటి వారిని స్థానిక పోలీస్ లు.గుర్తించడం లేదా సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించిన అటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.దేశ భద్రతకు ముప్పు కలిగించే రీతిలో వ్యవహరించే వ్యక్తులకు విదేశాలకు కూడా వెళ్లకుండా పాస్ పోర్ట్ జారీ కాకుండా కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాళ్లు రువ్వే వారి వివరాలు స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు రికార్డు లో ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.