ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు భయపడుతోంది.చైనాలో మొదలైన ఈ వైరస్, అక్కడ ఎలాంటి ప్రాణనష్టాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఇతర దేశాలకు పాకిన ఈ వైరస్, మన భారతదేశంలో కూడా అడుగు పెట్టేసింది.దీంతో ఇక్కడి ప్రజలు కరోనా పేరు చెబితేనే భయాందోళనకు గురవుతున్నారు.
అయితే కేవలం ఇండియా వాళ్లే కాకుండా హాలీవుడ్ జనాలు కూడా ఈ కరోనా పేరుతో కంగారు పడుతున్నారు.
ఇప్పటికే భారత్లో పలు సినిమా షూటింగ్లు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తు్న్నాయి.
కాగా తాజాగా హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ కూడా కరోనా వైరస్ను చూసి వణుకుతోంది.జేమ్స్ బాండ్ సిరీస్లో 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను భారత్లో ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని భావించారట చిత్ర యూనిట్.
కానీ ప్రస్తుతం భారత్లో పరిస్థితులు, కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాను నవంబర్కు వాయిదా వేశారు.
మొత్తానికి కరోనా వైరస్ దెబ్బకు సామాన్య ప్రజలే కాకుండా జేమ్స్ బాండ్ లాంటి బాబులు కూడా భయపడుతున్నారనే విషయం నిజం.
మరి కరోనా వైరస్ భారత్లో ఎలాంటి అరచాకం సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు నిపుణులు.