తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికే ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా ఈయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.
ఈ సినిమా జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ముఖ్యంగా ఈ సినిమాకు కీరవాణి అందించిన బాణీలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఎన్నో పురస్కారాలను అందుకుంది ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో నిలవడం విశేషం.ఇదివరకే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది.
ఇంకా చిత్ర బృందం ఈ సంతోషం నుంచి బయటపడక ముందే కేంద్ర ప్రభుత్వం సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంతో చిత్ర బృందం మరింత సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడంతో ఈ విషయంపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు.
ఈ సందర్భంగా రాజమౌళి కీరవాణి వయోలిన్ వాయిస్తూ ఉండగా తాను కింద కూర్చున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది… చాలా ఆలస్యమైంది.కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా… ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాకే మరొకటి ఇవ్వమని చెబుతాను అంటూ పోస్ట్ చేశారు.నా పెద్దన్న కీరవాణి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది అంటూ రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.