రీమేక్‌ల ఆలోచనలో జక్కన్న?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో సంచలనం సృష్టించాడు.మొదటి పార్ట్‌ బాహుబలి భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది, రాబడుతూనే ఉంది.

 Jakkanna New Movies Are Remakes..?-TeluguStop.com

ప్రస్తుతం ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న జక్కన్న త్వరలో రెండవ పార్ట్‌ షూటింగ్‌ను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు.ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన సగంకు పైగా చిత్రీకరణ పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక ‘బాహుబలి’ తర్వాత జక్కన్నకు తెలుగు రెండు క్లాసిక్‌ మూవీలను రీమేక్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో సూపర్‌ హిట్‌ చిత్రాలుగా నిలిచిన ‘మిస్సమ్మ’ మరియు ‘గుండమ్మ కథ’ చిత్రాలు అంటే జక్కన్నకు అమితమైన అభిమానం.

ఆ అభిమానంతోనే ఆ రెండు సినిమాలను తెలుగు మరియు తమిళంలో రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.తెలుగు నుండి ఒక స్టార్‌ హీరో తమిళం నుండి ఒక స్టార్‌ హీరోను తీసుకుని మల్టీస్టారర్‌ సినిమాగా చేస్తే భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలవడం ఖాయం అని జక్కన్న భావిస్తున్నాడట.

మరో వైపు ఎప్పటికైనా మహాభారతంను వెండి తెరపై ఆవిష్కరించాలన్నది జక్కన్న కోరిక.ఇవన్ని తీరాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలో.‘బాహుబలి’ రెండవ పార్ట్‌ వచ్చే సంవత్సరం జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ తర్వాత మహేష్‌బాబుతో ఒక సినిమా చేయనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube