పుల్వామా ఉగ్ర దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్ర వాద సంస్థ వ్యవస్థాపకుడు.ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అజార్ మసూద్ మరణించినట్లు తెలుస్తుంది.
కొంత కాలంగా కిడ్నీ సంబందిత సమస్యలతో బాధపడుతున్న మసూద్ పాకిస్తాన్ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.పుల్వామా దాడి తర్వాత జైషే మహ్మద్ ఉగ్ర వాద సంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తున్న నేపధ్యంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలోనే ఉన్నాడని నిర్ధారించింది.
అయితే పుల్వామా ఉగ్ర దాడితో జైషేకి సంబంధం లేదని వాదిస్తుంది.
పాకిస్తాన్ మంత్రి కూడా మసూద్ అజార్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి వుందని, అతను ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు.
ఈ నేపధ్యంలో తాజాగా మసూద్ అజార్ మరణించిన నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ద్రువీకరించక పోవడం విశేషం.మరి ఈ వార్తలలో నిజమెంత అనేది తెలియాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించే వరకు చూడాల్సిందే.