ఈ చిరంజీవి మేనకోడలు ఇప్పుడెలా ఉందో తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన  “జై చిరంజీవ” చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్  శ్రియ శర్మ గురించి  కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Jai Chiranjeeva Movie Fame Child Actress Shriya Sharma Transmission News, shriy-TeluguStop.com

 అయితే ఈ చిత్రంలో శ్రియ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దీంతో అమ్మడికి  ఈ చిత్రం తర్వాత తమిళం, కన్నడ, మలయాళం,  హిందీ తదితర భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

జై చిరంజీవ చిత్రం తర్వాత తెలుగులో  గాయకుడు, ఎటో వెళ్ళిపోయింది మనసు, తూనీగ తూనీగ, తదితర చిత్రాలలో  నటించింది.  అలాగే  2016వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  నాగ కోటేశ్వరావు దర్శకత్వం వహించిన  “నిర్మలా కార్మెంట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా నటించాడు.

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.కానీ ఏమైందో ఏమో గాని అప్పటినుంచి ఈ అమ్మడు తెలుగులో మళ్లీ నటించలేదు.

కానీ ప్రస్తుతం శ్రియ శర్మ కొంతకాలం పాటు సినిమాలకు  విరామం ఇచ్చి తన పై చదువులపై దృష్టి సారించినట్లు సమాచారం. దాంతో ప్రస్తుతం ఇతర దేశాల్లో శ్రియ శర్మ ఉన్నత చదువులు చదువుతోంది.

ఈ క్రమంలో పలువురు సినిమా ఆఫర్లు ఆమెకు తలుపుతట్టినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube