కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది లాయర్ చంద్రు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన చిత్రం జై భీమ్.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యి ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.
దళిత కుటుంబం పట్ల జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎదురించి వారికి ఏ విధమైనటువంటి న్యాయం చేశారనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా సూర్య ఎంతో అద్భుతంగా చూపించారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చర్చకు కారణం అయింది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ సమస్థ ఆస్కార్ తమ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేయడం విశేషం.
జైలు వద్ద దొంగలను కులాల వారిగా విభజించి జైలుకు పంపించడం చివర్లో సూర్య ఎంట్రీ ఇచ్చి తన వాదనలు వినిపించడం వంటి 12 నిమిషాలకు సంబంధించిన సన్నివేశాలను ఆస్కార్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం చేస్తోంది.
అయితే గతంలో ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలోని సన్నివేశాలు ఇలా అంతర్జాతీయ వేదికపై ప్రసారం కాలేదు మొట్టమొదటిసారిగా సూర్య నటించిన జై భీమ్ చిత్రంలోని సన్నివేశాలు ప్రసారం కావడంతో ఇది కేవలం సూర్య అభిమానులు మాత్రమే కాకుండా ఇండియా గర్వించదగ్గ విషయమని చెప్పవచ్చు.ఇక తమ అభిమాన నటుడు సూర్య నటించిన ఈ సినిమాకు ఇంత మంచి గౌరవం లభించడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.