తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది.కాని టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో బీజేపీకి, టీఆర్ఎస్ కు మధ్య పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి.
అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఐక్య రాగం వినిపించిన నెల రోజులు కూడా కాకముందే మరో సారి కలహాల కుమ్ములాటతో మరో సారి కాంగ్రెస్ పార్టీ వార్తల్లో నిలిచిన పరిస్థితి ఉంది.ఇటీవల మంత్రి కేటీఆర్ సంగారెడ్డి పర్యటనలో మంత్రి కేటీఆర్ కి, జగ్గారెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఎంతలా వార్తల్లో నిలిచిందో మనం చూశాం.
ఈ ఘటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో అలజడి రేగింది.
దీంతో రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా రాజకీయాల్లో కలగజేసుకుంటున్నాడంటూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ఏకంగా సోనియాగాంధీకి లేఖ రాయడం జరిగింది.
దీంతో అప్పటి నుండి జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా జగ్గారెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లో ఓ చిల్లర బ్యాచ్ తయారయిందని, తనను టీఆర్ఎస్ కోవర్ట్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని ఇలా ఆధారాలు లేకుండా రాతలు రాస్తే బాగుండదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
దీంతో అదే సమయంలో రేవంత్ రెడ్డి మంత్రి కెటీఆర్ క్లోజ్ గా ఉన్న ఫోటోను చూపిస్తూ ఇలా ఉంటే కోవర్ట్ గా ఉండటం కాదా అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.దీంతో త్వరలో జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.అయితే తన స్వంత పార్టీ అయిన కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటంతో త్వరలో టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.