తెలంగాణ కాంగ్రెస్ ఎప్పుడూ వివాదాల్లోనే కొనసాగుతోంది.ఎప్పుడైతే ఉత్తమ్కుమార్రెడ్డి తన టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారో అప్పటి నుంచి మాకంటే మాకంటూ ఆ పదవి కోసం కొట్లాట మొదలైంది.
తెలంగాణ ముఖ్య నేతలంతా ఈ పదవి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.తమకు పదవి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరిస్తున్నారు.
ఇంకోవైపు రేవంత్రెడ్డికి ఇస్తారంటూ ప్రచారం జరగడంతో బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు సీనియర్లు.తమకు ఇవ్వకుంటే బాగుండదంటూ హెచ్చరిస్తున్నారు.వీహెచ్ లాంటి సీనియర్ నేతలయితే డైరెక్టుగానే రేవంత్పై విమర్శలు చేస్తున్నారు.ఇంకోవైపు జగ్గారెడ్డి కూడా ఈ పదవి తనకు ఇవ్వాలంటూ అప్పట్లో సోనియాగాంధీకి లేఖ రాశారు.
అయితే అప్పట్లో రేవంత్పై విమర్శలు కూడా చేశారు.రేవంత్కు ఇస్తే తామంతా జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు.
అయితే ఇప్పుడు ఆయన కొంత వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.రీసెంట్గా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా పర్వాలేదన్నారు.ఎవరికి ఇచ్చినా తామంతా రాహుల్ నేతృత్వంలోనే పనిచేస్తామంటూ హింట్ ఇచ్చారు.అయితే టీపీసీసీ పదవిపై తాను త్వరలోనే పూర్తి వివరాలు చెబుతానంటూ ట్విస్టు ఇచ్చారు.
ఇక తనకు టీపీసీసీ ఇవ్వకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయినా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.తనలాంటి సీనియర్లకు గౌరవం ఇవ్వాలంటూ కోరారు.రీసెంట్గా రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో వారిద్దరిలో ఎవరికో ఒకరికి పదవి రావడం ఖాయమని తెలుస్తోంది.అయితే ఇప్పుడు జగ్గారెడ్డి ఈ పదవిపై మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది.
మరి రేవంత్కు ఇస్తే ఆయన నేతృత్వంలో జగ్గారెడ్డి పనిచేస్తారా లేక వర్గ విభేదాలకు తెరతీస్తారా అన్నది చూడాలి.ఇంకోవైపు వీహెచ్ కూడా తనకు ఇవ్వకుండా రేవంత్కుఇస్తే పార్టీలో సంక్షోభం వస్తుందని హెచ్చరిస్తున్నారు .చూడాలి మరి ఏం జరుగుతుందో.