తెలంగాణలో కాంగ్రెస్ రూటే సెపరేటు.అన్ని పార్టీలు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది.
ఆ పార్టీలో ఏకంగా అధినేత పైనే బహిరంగంగా విమర్శలు గుప్పించడం ఈ మధ్య మరీ ఎక్కువై పోయింది.ఉత్తమ్ ఉన్నప్పుడు ఈ విధంగా పెద్దగా ఎవరూ విమర్శించలేదు.
కానీ రేవంత్రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు.వారిని శాంతింపజేసేందుకు రేవంత్ ఎంత ప్రయత్నించినా వారు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవట్లేదు.
ఈ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన మార్కు రాజకీయాలను చూస్తున్నారు.వీలు కుదిరినప్పుడల్లా రేవంత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఓ సారి మిస్టేక్ జరిగిందని చెబుతూనే మళ్లీ అగ్గి రాజేస్తున్నారు.రీసెంట్ గా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ మీద వేసుకోవడంతో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
కావాలనే బీజేపీకి సపోర్టు చేశారనే ఆరోపణలు గుప్పించారు.దీనిపై ఢిల్లీ అధిష్టానానికి కూడా లేఖ రాశారు.
ఇది కాంగ్రెస్లో కలకలం రేపుతోంది.రేవంత్, భట్టి విక్రమార్క కావాలనే హుజూరాబాద్లో మైండ్ గేమ్ ఆడారని లెటర్లో పేర్కొన్నారు.
నాన్ లోకల్ క్యాండిడేట్ అయిన బల్మూరి వెంకట్ను ఎందుకు సెలెక్ట్ చేశారని ప్రశ్నించారు జగ్గారెడ్డి.అంతే కాదు బల్మూరికి పెద్దగా ఆర్థిక బలం లేనందున ఆయనకు పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిచాల్సిందిపోయి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు జగ్గారెడ్డి.ఢిల్లీ వార్ రూమ్లో జరిగే వ్యవహారాలు ఎలా లీక్ అవుతున్నాయని మండిపడ్డారు.
రేవంత్ను టార్గెట్ చేస్తూ జగ్గారెడ్డి లేఖ రాయడం కాంగ్రెస్లో పెను దుమారం రేపుతోంది.అయితే జగ్గారెడ్డి వాదనలో చాలా వరకు ఆమోదించదగ్గవి ఉండటంతో రేవంత్కు చిక్కులు తప్పేలా లేవు.
.