తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నప్పటికీ ఎల్లప్పడూ అంతర్గత కలహాలతో మాత్రమే ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి ఉంది.
అయితే కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రోజురోజుకు మరింతగా దూకుడు పెంచుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2023 లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయంగా సంచలనం రేపాయి.
అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నారు.
అయితే ప్రస్తుతం జగ్గారెడ్డి వ్యాఖ్యలను అంతగా ఎవరూ సీరియస్ గా తీసుకోని పరిస్థితి ఉంది.ఎందుకంటే తాజాగా కేటీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చిన సమయంలో కేటీఆర్ తో సంగారెడ్డి సన్నిహితంగా మెలగడంతో జగ్గారెడ్డి త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారా అనే చర్చ కూడా ఇటు కాంగ్రెస్ లో మరియు రాష్ట్ర రాజకీయాలలో కూడా మొదలైంది.
అయితే ఆ తరువాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరణ ఇవ్వడంతో ఆ చర్చ ఇక సద్దుమణిగింది.అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి మాత్రమే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరు భావిస్తుండగా, మరికొందరు టీఆర్ఎస్ నుండి వచ్చిన లీక్ అని మరికొందరు భావిస్తున్నారు.అయితే గత ఎన్నికల్లో ఇటు వంటి ముందస్తు ఎన్నికలు రావడంతోనే అప్పుడు కూడా ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయని అందుకే ఇటువంటి చర్చ సర్వత్రా మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.