ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలు తమ పదవులు కాపాడుకోవడం చుట్టే తిరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుందట.కరోనా విషయంలో ఎన్నో అసత్యపు మాటలు గులాభి నేతలు చెబుతున్నారని, అసలు ప్రజలకు ఏ విధంగా కూడా నేతల నుండి సహాయం లభిస్త లేదని, ముఖ్యంగా కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట.
ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.తెలంగాణ ప్రజలతో కామెడీ చేయొద్దని హెచ్చరించారు.
సీఎం వద్ద పేరు కోసం మాత్రమే తలసాని భజన చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.ఒకవేళ ఆయన చెప్పినట్లుగా కరోనా కేసులు తగ్గినట్లయితే తలసాని నిరూపించాలని సవాల్ విసిరారు.
కాగా కరోనా కష్టకాలం లో ఫార్మా ఓ మాఫియాలా తయారైందని దీన్ని అరికట్టలేక కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు.