ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా?

తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు.గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కూడా వారిని పట్టించుకోకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

 Jagga Reddy Comments On Telangana Governament-TeluguStop.com

అసలు ప్రభుత్వంకు సిగ్గు అనిపించడం లేదా అంటూ ప్రశ్నించాడు.హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోక పోవడంపై ఆయన ఆశ్చర్య వ్యక్తం చేశాడు.

తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఒక్క ఆత్మహత్య కూడా ఉండకుండా చూస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడేం చేస్తున్నాడు అంటూ ప్రశ్నించాడు.

తెలంగాణలో ఉన్న పలు సమస్యల పట్ల ప్రభుత్వం కనీసం విజ్ఞత ప్రదర్శించడం లేదు అంటూ జగ్గారెడ్డి అన్నాడు.

అసలు ఆర్టీసీ కార్మికులు అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.ఒక వైపు రైతులు మరో వైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి సమ్మె విరమింపజేయాలంటూ కోరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube