రాజకీయాల్లో వేసిన తప్పటడుగులతో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరో ఇరకాటంలో పడ్డారు.ఏకంగా ఆమె సొంత తమ్ముడే ఆమె మీద కేసు వేయడంతో అఖిల ప్రియ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
కుటుంబ ఆస్తి విషయంలో ఈ వివాదం చెలరేగింది.అఖిల ప్రియ ఆమె సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
ఇంతకీ విషయం ఏంటి అంటే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట సమీపంలోని భూమా నాగిరెడ్డి తనకు ఉన్న స్థలాన్ని ముగ్గురు పిల్లల పేర్లు రాశారు.అయితే దీన్ని 2016లో విక్రయించారు.
ఆ సమయంలో వాటాదారుగా ఉన్న భూమా అఖిలప్రియ, ఆమె సోదరి మౌనిక సంతకాలు చేశారు.అప్పుడు జగత్ విఖ్యాత్ రెడ్డి మైనర్ గా ఉండడంతో వేలి ముద్రలు మాత్రమే వేశారు.
ఆ విషయం అక్కడితో ముగిసింది.కానీ ఇంత కాలం తర్వాత తిరిగి అదే విషయమే జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన అక్క లతో పాటుగా ఆ ఆస్తిలో తనకు కూడా వాట రావాలంటూ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు.తాను మైనర్ గా ఉన్న సమయంలో సరిగ్గా వివరాలేవీ తెలియకపోవడంతో వేలిముద్రలు వేశానంటూ జగత్ విఖ్యాత్ రెడ్డి ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఆ స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరు అక్కలు సమానంగా పంచుకున్నారని కానీ తన వాటా ఇవ్వలేదని, ఇప్పుడు ఆ స్థలంలో వాటా తనకు ఇప్పించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు.అయితే ఇప్పుడు అఖిల ప్రియ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో సొంత సోదరుడు కేసు వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందా లేక మామూలుగానే ఇది జరిగిందా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.