ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య మందు ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దాదాపు 80వేల మంది ఈ మందు తీసుకుని కరోనాను జయించారు.
ఇక దీనిపై ఇప్పుడు ఐసీఎంఆర్ విచారణ జరుపుతోంది.త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక వస్తుందని అంతా ఆశిస్తున్నారు.
అయితే ఈ మందుపై జోరుగా చర్చ జరుగుతోంది.కొందరు పనిచేస్తుందని, కొందరు ప్రమాదమని వాదిస్తున్నారు.
అయితే ఇప్పుడు జగపతి బాబు స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి జగపతిబాబు.
ఆయనకు మనసులో అనిపించింది.క్లియర్ కట్గా చెప్పేస్తారు.
అయితే ఇప్పుడు ఆనందయ్య నాటుమందుపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఆనందయ్య రూపంలో మానవజాతిని కాపాడాటానికి నేచర్ ముందుకు వచ్చిందని, ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొంది అందరికీ అందాలని ఆయన కోరారు.
‘ఈ విపత్కర పరిస్థుతుల్లో మనల్ని కాపాడేందుకు నేచర్ ముందుకొచ్చినట్లు అనిపిస్తుంది.ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది.
ప్రపంచాన్ని కాపాడుతుందని అని నేను ఘాడంగా నమ్ముతున్నాను.అతడిని దేవుడు ఆశీర్వదించాలి’ అని జగ్గూభాయ్ తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.
అయితే ఆ మందుపై వస్తున్న చెడు వార్తలను నమ్మొద్దని జగపతి చెప్పాడు.
ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మందు హాట్ టాపిక్ గా మారింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల చూపు మొత్తం నెల్లూరు కృష్ణపట్నం వైపే ఉంది.ఆనందయ్య నాటు మందు పనిచేస్తుందా లేదా, అసలు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే విషయాల గురించి టీవీల్లో జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి.
పూర్తి స్థాయి నివేదిక వచ్చాక దాన్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.ఈ రెండు రోజుల్లో మందుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే కొందరు బ్లాక్ మార్కెట్లో దీన్ని అమ్ముతున్నారని, దాన్నిఎవరూ నమ్మొద్దని ఆనందయ్య కోరుతున్నారు.