టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ నటుల్లో జగపతి బాబు ఒకరు.ఎక్కువుగా కుటుంబ కథా చిత్రాలు చేసి ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు.
జగపతి బాబు దాదాపు 100 కు పైగా సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాడు.తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. జగపతి బాబు హీరో కన్నా విలన్ గానే ఎక్కువ మెప్పు పొందాడు.
ఈయన మొదటిసారిగా బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాలో జితేంద్ర పాత్రలో బాలయ్యకు పోటీగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ ను సూపర్ హిట్ సినిమాతో స్టార్ట్ చేసాడు.విలన్ గా మారిపోయిన తర్వాత జగపతి బాబు బిజీ అయ్యాడు.
ఆయనకు టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నుండి కూడా అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే తాజాగా జగపతి బాబు పెట్టిన ఒక పోస్టు ఆసక్తికరంగా ఉంది.ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలయి పోయింది.
ఇప్పుడు మునుపటి కన్నా ఎక్కువ వేగంగా కరోనా వ్యాప్తి చెందుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు.
మళ్ళీ సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి.
సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో జగపతిబాబు ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.కరోనా కు థాంక్స్ చెప్తూ ఒక పెట్టాడు.
ఎందుకు థాంక్స్ పెట్టాడని అనుకుంటున్నారా.కరోనా కారణంగా తనకి తానే మేకప్ వేసుకోవడం అలవాటు అయిందని షూటింగ్ లోకేషన్ లో ఉన్న ఒక ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.