టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో నాగశౌర్య ఓ సరికొత్త లుక్లో మనకు దర్శనమిస్తాడు.ఇక ఈ సినిమాకు ‘పార్ధు’ అనే ఆసక్తికరమైన టైటిల్ను పెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకునేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు విలక్షణ నటుడు జగపతిబాబును చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.
ఈ సినిమాలో ఓ మరాఠా యోధుడి పాత్రలో ఆయన మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.ఆర్చరీ బ్యాక్డ్రాప్తో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాను ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో మొదలైంది.
కాగా ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడగా, సెప్టెంబర్ 18 నుండి అన్ని జాగ్రత్తల మధ్య తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమా కోసం అదిరిపోయే సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు నాగశౌర్య.తన లాస్ట్ మూవీ ‘అశ్వద్ధామ’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో ఈసారి ‘పార్ధు’ చిత్రంతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోండగా కాళభైరవ సంగీతం అందించనున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.