టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్ధలం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను సుకుమార్ తనదైన స్టయిల్లో తెరకెక్కించడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్తో పాటు విలన్ పాత్రలో నటించిన జగపతి బాబుకు కూడా అదిరిపోయే పేరొచ్చింది.
తనదైన డైలాగ్ డెలివరితో మెప్పించిన జగపతి బాబు పర్ఫార్మెన్స్కు సుకుమార్ ఫిదా అయ్యాడట.ఈ క్రమంలోనే తన తాజా చిత్రం ‘పుష్ప’లో కూడా ఓ కీలక పాత్రలో నటించేందుకు ఆయన జగపతిబాబును తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని, అందులో జగ్గు భాయ్ తప్ప మరెవరూ ఒదిగిపోలేరని సుకుమార్ భావిస్తున్నాడట.దీంతో ఈ సినిమాలో జగపతి బాబు చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని పూర్తి మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కథ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోండగా, రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.