ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనే చెప్పాలి.ఎందుకంటే అప్పుల కూటములుగా మారిపోయాయి రెండు ప్రభుత్వాలు కూడా.
అయితే తెలంగాణలో పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉన్నా కూడా ఏపీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందనే చెప్పాలి.ఇక ఈ పరిస్థితులు ఇప్పుడు జగన్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయని చెప్పాలి.
ప్రస్తుతం ఏపీలో రాజధాని కూడా లేకుండానే పాలన సాగించడం ఒకటయితే లోటు బడ్జెట్ మరో సమస్యగా మారింది.ఇంకో వైపు సమృద్ధిగా వనరులు ఉన్నా కూడా సమస్యలే కనిపిస్తున్నాయి.
నిజానికి ఏపీలోని 13 జిల్లాలతో సమగ్రంగా కనిపిస్తున్నా నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు సమస్యల సుడిగుండంలోనే ఉండంటంతో జగన్కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పనక తప్పదేమో.ఇటు చూస్తే తెలంగాణలో కూడా పెద్దగా ఆదాయమేమీ పెరగకపోయినా కూడా వృద్ధి రేటు మాత్రం క్రమంగా పెరగడం కేసీఆర్కు కలిసి వస్తున్న అంశమనే చెప్నపాలి.
ఈ కారణంతో ఆయన ఇమేజ్ ఎఅంతో ఇంతో పెరుగుతోంది.కానీ ఏపీ సీఎం జగన్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఇది వైసీపీని టెన్షన్ పెడుతోంది.
ఈ పరిస్థితులు ఇప్పుడు నీతి ఆయోగ్ దృష్టిలో ఉండటంతో వారు కూడా అర్ధనీతి పేరుతో రీసెంట్ గా ఓ లిస్టును రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.దీంట్లో రెండు తెలుగు రాష్టరాల ప్రగతికి సంబంధించిన నివేదిక ఉండటం ఇది కాస్తా జీఎస్డీపీ పరంగా ఇప్పడు తెలంగాణను మన దేశంలోనే ఏడో పెద్ద రాష్ట్రంగా అవతరించిందని తెలుపుతున్నాయి.అయితే ఇదే సమయంలో అటు ఏపీ పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని చూపెడుఉతన్నాయి.
ఒకవైపు తెలంగాణ పారిశ్రామిక రంగంతో పాటు ఫార్మా రంగంలో దూపుకుపోతుంటే ఏపీలో మాత్రం అందుకు పరిస్థితులు పూర్తి భిన్నంగా తయారయ్యాయని తెలుపుతున్నాయి.