మాజీ మంత్రి వైెఎస్ వివేకానంద హత్య కేసుపై బిజెపి నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఏపీ శాఖ చేపట్టిన ప్రజా పోరులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
వివేకా హత్య కేసులో సీఎం జగన్ బండారం కూడా బయటపడుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.ఆడపడచులకు భద్రత ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.
సీఎం జగన్కు ఎవరు ఎదురు చెప్పినా వారిపై కేసులు నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్కు సరైన సమయంలో కేంద్రం చెక్ పెడుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు.